Tuesday, April 30, 2024

TS | ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికం.. మోదీ దిష్టిబొమ్మ దహణం

నిజామాబాద్ (ప్రభ న్యూస్) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ జాగృతి నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్‌లోని ధర్నా చౌక్‌లో జాగృతి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జాగృతి నాయకులు బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జాగృతి జిల్లా మాజీ కన్వీనర్ లక్ష్మీనారాయణ భరద్వాజ్, షెహజాదా రెహాన్ అహ్మద్ మాట్లాడుతూ… మహిళా అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కవిత అరెస్టు చట్ట విరుద్ధమని అన్నారు. అరెస్టు సమయంలో ఈడీ అధికారులు నిబంధనలు పాటించలేదని తెలిపారు. అంతే కాకుండా రాత్రిపూట మహిళను అరెస్టు చేయడం దుర్మార్గమని, న్యాయమూర్తి నుంచి వారెంట్ తీసుకోకుండా మహిళను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement