Sunday, May 19, 2024

TS| హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌లో ఘనస్వాగతం.. కన్హ శాంతి వనంలో రాష్ట్రపతి ప్రసంగం

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి ముర్ముకు సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ముర్ము నగర శివారులోని కన్హ శాంతి వనానికి చేరుకుని.. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, హార్ట్ ఫుల్‌నెస్ సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్ గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రాజ్‌భవన్‌కు చేరుకుని శుక్రవారం రాత్రి బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement