Sunday, May 5, 2024

America:  రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వాసి దుర్మారణం

అమెరికాలోని టెక్సస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయిరాజీవ్‌రెడ్డి (28) విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది.

తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గతకొంతకాలం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సస్‌లోనే నివాసం ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement