Monday, April 29, 2024

కేసుల విచారణలో.. నుపుర్ శర్మకు ఊరట

నుపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆమెపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో పార్టీ నుంచి బీజేపీ స‌స్పెండ్ చేసింది. అయితే నుపుర్ శ‌ర్మ‌కు ఉప‌శ‌మనం ల‌భించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై న‌మోదైన 10 కేసుల‌ను ఢిల్లీ కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని సుప్రీంకోర్టు బుధ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసుల‌న్నింటినీ ఢిల్లీ పోలీసులే విచారిస్తార‌ని తెలిపింది. ఇక‌పై నుపుర్ శ‌ర్మ‌పై ఎక్క‌డ ఎఫ్ఐఆర్ న‌మోదైనా ఆ కేసుల‌న్నీ ఢిల్లీ కోర్టుకే బ‌దిలీ అవుతాయ‌ని, ఢిల్లీ పోలీసులే ప‌ర్య‌వేక్షిస్తార‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. నుపుర్ శ‌ర్మ‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ కొన‌సాగుతూనే ఉంటుంద‌ని కోర్టు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement