Saturday, May 4, 2024

పార్ట్‌ టైం ఎంబీఏ నోటిఫికేషన్‌ విడుదల.. కోర్సుల్లో ప్రవేశాలకు అవ‌కాశం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :పార్ట్‌ టైెం ఎంబీఏ రెండేళ్లు, మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు సీపీజీఈటీ-2021 కన్వీనర్‌ ప్రొ. ఐ పాండురంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు రూ.1500 ఫీజు చెల్లంచి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

ఈ నెల 6 నుంచి 27 వరకు దరఖాస్తులను రుసుము చెల్లించి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 4 వరకు దరఖాస్తు చేసరకోవచ్చన్నారు. టీఎస్‌ ఐసెట్‌ రాయని వారు, రాసినా క్వాలిఫై కాని వారు పార్ట్‌ టైం ఎంబీఏ కోర్సులో జాయిన్‌ కావొచ్చన్నారు. మరిన్ని వివరా లకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement