Thursday, April 25, 2024

వడ్ల కుప్ప మీద ఆగిన రైతు గుండె.. ఆ ఇద్దరి పాపం కాదా!?

కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య అనే రైతు వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీరయ్య కుటుంబ సభ్యులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేత మాట్లాడించారు. ఈ సందర్భంగా బీరయ్య కొడుకు రాజేందర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ‘’ అయ్య కేసీఆరేమో రైతు పక్షపాతట. కొడుకు కేటీఆరేమో సాంకేతిక నిపుణుడట. కానీ, ధాన్యం అమ్ముకోలేక వడ్ల కుప్పల పై రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. ధరణి సమస్యల వలయంలో చిక్కి ఎకరం, అరెకరం అమ్ముకోలేక అన్నదాతలు ఉసురు తీసుకుంటున్నారు. ఇది ఆ ఇద్దరి పాపం కాదా!?’’ అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement