Tuesday, April 30, 2024

రెడ్మి ఎంట్రీ లెవ‌ల్ ఫోన్లు.. భారీ ఆఫ‌ర్లు

భారత మార్కెట్లో రీసెంట్ గా Redmi కంపెనీ నుంచి Redmi A2, Redmi A2+ స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. అయితే ఇవ్వ‌లాట్ని నుంచే ఈ స్మార్ట్‌ఫోన్ల‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్లపై రెడ్‌మీ కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను సైతం అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో దాదాపు ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే రెడ్‌మీ A2+ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం అదనంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. గత ఏడాది వచ్చిన రెడ్‌మీ A1 సిరీస్ కన్నా A2 సిరీస్‌లో అదనపు హంగులు, మరింత శక్తివంతమైన చిప్‌లను జోడించారు.

Redmi A2 స్మార్ట్‌ఫోన్ 2GB RAM విత్ 32GB స్టోరేజీ మోడల్‌కు రూ.6,299.
2GB RAM విత్ 64GB స్టోరేజీ మోడల్‌ వేరియంట్ ధర రూ.6,999, 4GB RAM… 64GB స్టోరేజీ మోడల్ ధర రూ.7,999.
Redmi A2+ స్మార్ట్‌ఫోన్ 4GB RAM విత్ 64GB స్టోరేజీతో ఒకే మోడల్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.8,499గా నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement