Tuesday, May 14, 2024

మొదలైన మూడో టీ20.. డూ ఆర్ డై మ్యాచ్ లో భార‌త్

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా మొద‌టి రెండు మ్యాచ్ లు ఓడిపోగా.. ఇవ్వాల జ‌రుగుతున్న మ్యాచ్ ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్ లా మారింది. ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో తొలి రెండు టి20ల్లో ఓడిన భారత్.. సిరీస్ లో నిలవాలంటే మూడో మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. కాగా, ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మ్యాచ్ ప్రారంభం అయింది. ఇవ్వాల జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన‌ వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ లో విండీస్ ఒక మార్పు చేసింది. రెండో టి20లో గాయపడ్డ జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ చేజ్ ను తుది జట్టులోకి తీసుకుంది. అదే విధంగా భారత్ కూడా రెండు మార్పులు చేసింది. ఐపీఎల్ హీరో యశస్వి జైస్వాల్.. ఇషాన్ కిషన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్న కుల్దీప్ యాదవ్ కు ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement