Thursday, May 2, 2024

Skydiving: జైశ్రీరాం జెండాతో 13వేల అడుగుల ఎత్తు నుంచి రామ‌భ‌క్తురాలి స్కైడైవింగ్..

అయోధ్యాపూరిలోని శ్రీరామమందిరం ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం కోసం సిద్ధమవుతుంది. ఈ నెల 22వ తేదిన జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ తో సహా ఏడు వేల మందికిపైగా వీఐపీలు, ప్రముఖులు హాజరుకానున్నారు.

13వేల అడుగుల ఎత్తులో నుంచి జై శ్రీరామ్
ఈ నేపథ్యంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ కు చెందిన 22ఏళ్ల అనామిక శర్మ బ్యాంకాక్ లో 13వేల అడుగుల ఎత్తులో నుంచి జై శ్రీరామ్ అని రాసి ఉన్న జెండాతో స్కైడైవింగ్ చేసి అయోధ్యలోని రామమందిరంపై ఉన్న తన భక్తిని ప్రదర్శించింది. నేను నా మతాన్ని ప్రేమిస్తాను..నా మతాన్ని స్కైడైవింగ్ ను కలిసి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అంటూ అనామిక శర్మ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె భ‌క్తికి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement