Saturday, May 4, 2024

Telugu Mahasabhas: రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నేటి నుంచి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు

ఆదికవి నన్నయ నడిచిన నేల రాజమండ్రిలో ఇవాళ్టి నుంచి రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగనున్నాయి.

స్థానిక గైట్‌ కళాశాల ప్రాంగణం నిర్వహించనున్న మహాసభలకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు గవర్నర్లు, నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు కేంద్రమంత్రులు హాజరు కాబోతున్నారు. కాగా, కళాశాల ప్రాంగణంలో రాజరాజనరేంద్రుడి పేరుతో ప్రధాన వేదిక, ఆదికవి నన్నయ, కవి నారాయణభట్టు వేదికలను రెడీ చేశారు. తొలి రోజు ప్రారంభోత్సవానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. తొలి రోజున 72 మంది తెలుగు వెలుగులు కుటుంబ సభ్యులకు పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. అలాగే కవి సమ్మేళనాలు, సదస్సులు, అష్టావధాన కార్యక్రమాలు ఉండనున్నాయి.

శనివారం సాయంత్రం ‘తెలుగు తోరణం’ నృత్యరూపక ప్రదర్శన, విశిష్ట సేవాపురస్కారాలను ప్రధానం చేయనున్నారు. అదివారం నాడు అంతర్జాల వేదికగా కవి సమ్మేళనం ఉండనుంది. కవి పోషకుడు రాజరాజనరేంద్రుడికి 1,000 మంది కవులు 1000 కవితలతో నీరాజనం పలికేలా ప్లాన్ చేశారు. అలాగే, అంతర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరించుకుని గైట్‌ ప్రాంగణంలోని ప్రధాన వేదికల దగ్గర ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతుంది. ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement