Monday, April 29, 2024

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో రాజశ్యామల యాగం ప్రారంభం

దేశం సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం మొదలు పెట్టారు. ఈ ఉదయం పూజా ప్రారంభమైంది. ఈ యాగం కోసం ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఇతర ఏర్పాట్లు అన్నీ పూర్తిచేశారు. యాగ నిర్వహణ కోసం వారు సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement