Saturday, May 18, 2024

IPL | రాజస్థాన్ ఢమాల్.. 59 పరుగులకే ఆల్ అవుట్

జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవ్వాల (ఆదివారం) మధ్యాహ్నం రాజ‌స్థాన్ రాయ‌ల్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్​ జరిగింది. ఈ 60వ మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాదించింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై 112 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి171 పరుగులు చేయగా.. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజస్థాన్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు.

దీంతో 10.3 ఓవర్లలోనే రాజస్థాన్​ జట్టు 59 పరుగులు మాత్రమే చేసి 10 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో వికెట్ తీసుకోగా.. కర్ణ్ శర్మ, మైఖేల్ బ్రేస్‌వెల్ తలా రెండు వికెట్లు సోంతం చేసుకున్నారు. ఇక అత్యధికంగా వేన్ పార్నెల్ 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement