Tuesday, April 30, 2024

Rajasthan: కుప్ప‌కూలిన వాయుసేన‌ నిఘా విమానం

రాజస్థాన్‌లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన గూఢ‌చారి విమానం కుప్ప‌కూలింది. ఈఘ‌ట‌న గురువారం ఉద‌యం జైసల్మేర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఎక్స్ వేదికగా తెలిపింది.

- Advertisement -

జైసల్మేర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధని జాజియా గ్రామంలో ఓ బహిరంగ ప్రదేశంలో విమానం కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వైమానిక దళ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ విమానాన్ని ఏఐఎఫ్ నిఘా, గూఢచారి కార్యకలాపాలు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement