Tuesday, April 30, 2024

మెద‌క్ జిల్లాలో కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌..

తెలంగాణ‌లో భార‌త్ జోడో యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. రాహుల్ గాంధీకి ప్ర‌జ‌లు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఆదివారం మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం, రాంపూర్ పెద్దమ్మ గుడి నుంచి ప్రారంభమైంది. ఆయ‌న వెంట రాష్ట్ర నాయ‌కులు, పార్టీ శ్రేణులు పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. మొత్తంమీద జోడో యాత్ర ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది. ఇవాళ అల్లాదుర్గం మండలం నుంచి పెద్దశంకరంరంపేట మండలంలోని చింతల్ లక్ష్మపూర్ వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా దాటి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం, పెద్దకొడపగల్‌కు చేరుకుంటారు. రాత్రి ఇక్కడే రాహుల్ బసచేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement