Monday, May 6, 2024

Nyay Jodo Yatra – రాహుల్ యాత్రలో టెన్ష‌న్ టెన్ష‌న్‌….

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్‌లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అడుగడుగునా రాహుల్ జోడో యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నది. సోమవారం అసోంలోని ఓ ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత మోరెగావ్‌ జిల్లాలో పాదయాత్రకు, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌కు అనుమతి నిరాకరించారు. అయినా రాహుల్‌గాంధీ ఇవాళ మోరెగావ్‌లో పాదయాత్రకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మోరెగావ్‌ పోలీసులకు కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement