Friday, April 26, 2024

నాపై పుకార్లు పుట్టించేవారిపై కోర్టుకు వెళ్తా: రాధిక

సినీ నటి రాధికకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సదరు వార్తలపై ట్విట్టర్‌ ద్వారా నటి రాధిక స్పందించారు. తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టిస్తున్న వారిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. కొన్నిరోజుల నుంచి తన ఆరోగ్యంపై ఆన్‌లైన్‌లో ఎన్నో పుకార్లు వస్తున్నాయని ఆమె తెలిపారు.‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాకు కరోనా వైరస్‌ సోకలేదు. వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వృత్తిపరమైన జీవితంలో బిజీ అయ్యాను. ఆరోగ్యం గురించి కొంతమంది ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారు. ఈ పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తా’ అని రాధిక తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement