Thursday, April 25, 2024

మాస్క్ లేకుంటే జ‌రిమానా వాత – కెసిఆర్

హైదరాబాద్‌, : కరోనా కట్టడి కోసం ప్రతిక్ష ణం అప్రమత్తంగా ఉండాలని, అందరూ విధిగా మాస్కులు ధరించాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరారు. ముఖ్యం గా జనం రద్దీగా ఉండే ప్రాంతలు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ప్రజలతో పాటు కార్పొరేషన్లు, మునిసిపా లిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహిం చిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నా రు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తిరిగి పునరావృతమవు తున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధి కారులను ఆదేశించారు. అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు వందశాతం వ్యాక్సినేషన్‌ చేయించాలన్నారు.
ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి, పంచాయితీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌ శర్మతో ఫోన్లో మాట్లా డారు. వారి వారి శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వ్యాక్సి నేషన్‌ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ పురోగతిని ప్రతిరోజూ ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్టు చేయాలని స్పష్టంచేశారు.
వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌
పోలీస్‌, పంచాయితీరాజ్‌, మునిసిపల్‌, ఆర్టీసీ, రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టడం కోసం కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు, అన్ని జిల్లాల్లోనూ కరోనా నిర్ధారించే ఆర్టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ఆర్టీపీసీఆర్‌ కిట్స్‌ తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు. గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్‌ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.
మాస్క్‌ల నిబంధన కఠినంగా అమలు
కరోనా నియంత్రణ కోసం కీలకమైన మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్‌ శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, డీఎంఈ రమేష్‌రెడ్డి, వైద్యశాఖ సలహాదారు డాక్టర్‌ టి.గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement