Saturday, April 27, 2024

వైకుంఠ ద్వార దర్శనం కోసం 22న టికెట్ల కోటా విడుదల…

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 2,000 టికెట్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్‌ కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్‌ చేసుకున్న భక్తులకు మహాలఘు దర్శనం (జయవిజయల వద్ద నుంచి మాత్రమే) ఉంటుంది. భక్తు ఈ విషయాన్ని గమనించాలను టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement