Monday, April 29, 2024

ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ సెన్సార్ పూర్తి

ఓ వైపు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఆయన ఫిలిం పార్ట్‌నర్ ఛార్మి డ్రగ్స్ కేసులో ఈడీ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే వారి మూవీ ‘రొమాంటిక్’ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ‘రొమాంటిక్’ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను జరిపేసుకుంది. ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీకి పూరి జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందించారు. అనిల్ పాదూరి దీనికి దర్శకత్వం వహించారు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను పూరీ జగన్నాథ్ నిర్మించారు.

ఈ మూవీకి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ ఇవ్వకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని నిర్మాతలు తెలిపారు. కేతిక శర్మ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘రొమాంటిక్’ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు. అతి త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు పూరి జగన్నాథ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement