Wednesday, May 15, 2024

ఆర్ఆర్ఆర్ అరెస్ట్ పై పురంధేశ్వరి రియాక్షన్

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేయడంపై రాజకీయ దుమారం రేపుతోంది. అలాగే రఘురామకృష్ణం రాజు అరెస్టును చాలా మంది రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు.

కాగా తాజాగా బిజెపి మహిళా నేత జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఖండించారు. ప్రతిష్టకు భంగం కలిగేలా మాత్రమే కాదు న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఇప్పటివరకు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ అవసరం కూడా ఉందని అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement