Monday, April 29, 2024

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి ఆక్సిజన్ సంక్షోభం

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ఆక్సిజన్ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్‌లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును  తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. గత 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్‌కి ఆక్సిజన్ వస్తుండగా.. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. అయితే ప్రస్తుతం 8 కేఎల్‌కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్‌ కు గుత్తేదార్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం స్విమ్స్‌ లో 467 మంది  కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 90 శాతం పడకలకు ఆక్సిజన్ అవసరమని వైద్యులు చెబుతున్నారు.  రుయా ఘటన దృష్ట్యా స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఇక్కడి పరిస్థితిని చిత్తూరు జిల్లా కలెక్టర్, స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని స్విమ్స్ డైరెక్టర్ సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement