Sunday, April 28, 2024

పొన్నియిన్ సెల్వ‌న్ వ‌సూళ్ల సునామి-రూ.400కోట్ల క్ల‌బ్ లో మ‌ణిర‌త్నం చిత్రం

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రం వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. తమిళ ఇండస్ట్రీలో నయా రికార్డులను సృష్టిస్తుంది. కేవలం తమిళంలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్‌లను రాబడుతుంది.ఈ చిత్రాన్ని లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెరకెక్కించాడు.ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి భారీ తారాగణం నటించడంతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. మొదటి రోజే ఈ చిత్రం 80కోట్ల వరకు కలెక్షన్‌లు సాధించి ఔరా అనిపించింది.ఇక ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసకున్న ఈ చిత్రం తాజాగా రూ.400కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. తమిళ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన నాలుగో సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. మొదటి మూడు స్థానాల్లో ‘రోబో2.o’, ‘కబాలి’, ‘విక్రమ్‌’ సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సిరీస్‌లోని రెండో పార్టు మూడు నుండి ఆరు నెలల్లో విడుదలకానుంది.

https://twitter.com/rameshlaus/status/1579650830198001666
Advertisement

తాజా వార్తలు

Advertisement