Friday, April 26, 2024

ఐరాస భద్రతా మండలిలో 5 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం

ఐక్యరాజ్య సమితి లోని శక్తిమంతమైన భద్రతా మండలిలో ఐదు దేశాలు తాత్కాలిక సభ్యత్వం పొందాయి. అల్జిరియా, గయానా, సియెర్రా లియోన్‌, స్లొవేనియా, దక్షిణ కొరియా ఈ కీలక హోదాలకు ఎన్నికయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో ఐరాస సాధారణ సభ తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకున్నది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో పాలుపంచుకుంటున్న బెలారస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి సభ్యత్వం కల్పించేందుకు సభ్యదేశాలు తిరస్కరించాయి. కొత్తగా ఎన్నికైన దేశాలు 2014, జనవరి 1న బాధ్యతలు స్వీకరించనున్నాయి. తాత్కాలిక సభ్యదేశాల ఎంపిక కోసం జరిగిన ఓటింగ్‌లో గయానాకు 191 ఓట్లు రాగా, సియెర్రా లియోన్‌ 188, అల్జిరియా 184, దక్షిణ కొరియాకు 180 ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -

ఇక ఐదో సభ్యదేశంగా బెలారస్‌కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా, స్లొవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్‌కు 38 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. కాగా, అల్బేనియా, బ్రెజిల్‌, గబాన్‌, ఘనా, యూఏఈ దేశాల పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగినునున్నది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పించారు. ఐరాస భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. వాటిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు కాగా, పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement