Thursday, May 2, 2024

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు నిరసన సెగ

బీజేపీ పార్టీ అభ్యర్థి తరఫున సంస్థాన్‌ నారాయణపురంలో ప్రచారం నిర్వహిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు నిరసన సెగ తగిలింది. మండలంలోని లింగవారిగూడెంలో రఘునందన్‌ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే గ్రామ ప్రజల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమ ఊర్లో ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో చేసేందేం లేక రఘునందన్‌ రావు వెనుతిరిగారు. గత రెండ్రోజుల క్రితం ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిని ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement