Sunday, May 5, 2024

తెలంగాణలో ప్రధాని పర్యటన వాయిదా.. ఈనెల 19న ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఖరారు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ప్రధాని పర్యటన కోసం బీజేపీ తెలంగాణ నేతలు ముమ్మరంగా చేస్తున్న తరుణంలో అనివార్య కారణాలతోనే ప్రధాని పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 19న తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. 19న సికింద్రాబాద్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించడంతోపాటు సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణకు శంకుస్థాపన.. తదితర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.

అభివృద్ధి కార్యక్రమాల అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగసభకు కూడా బీజేపీ రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 19న ప్రధాని మోడీ ఇతర అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున తెలంగాణ పర్యటన వాయిదా పడిందని, మరోమారు ప్రధాని పర్యటన ఖరారు కానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్‌ను త్వరలోనే తెలియజేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement