Monday, April 29, 2024

బ‌స్సు ప్రమాదంలో మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా భాకరాపేట వ‌ద్ద శ‌నివారం అర్ధ‌రాత్రి బ‌స్సు లోయ‌లో ప‌డి ఎనిమిది మంది చ‌నిపోగా.. 40మంది వ‌ర‌కు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను అందించాలని ప్రధాని ఆదేశించారు. మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement