Friday, March 29, 2024

రైతుల అభివృద్దే ద్యేయం.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

రైతుల అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిధులు రూ.35.69 లక్షల తో నిర్మించిన గోదామును టెస్కాబ్ ఛైర్మెన్ కొండూరి రవీందర్ రావు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు పెద్దఎత్తున గోదాముల నిర్మాణం చేపడుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు రైతు బీమా పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement