Thursday, May 2, 2024

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి : నవనీత్ కౌర్

మ‌హా రాష్ట్ర‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఎంపీ న‌వ‌నీత్ కౌర్ అన్నారు. మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాలు రోజురోజుకు కీల‌క మ‌లుపులు తిరుగుతున్నాయ‌ని, శివసేన కీలక నేత ఏక్ నాథ్ షిండే ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి గువాహటిలో క్యాంపు పెట్టారు.. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై శివసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలకు తెరదీశాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ ఇండిపెండెంట్ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గూండాయిజాన్ని అంతం చేయాలని ఆమె అన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement