Monday, April 29, 2024

మీ చేతుల్లో తెలుగు జాతి భ‌విష్య‌త్తు సుర‌క్షితం- జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌ల‌పై సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతంలో కార్యక్రమం ప్రారంభమైనందుకు ఆనందంగా ఉందన్నారు. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండడాన్ని గర్విస్తున్నానని అన్నారు. తెలుగు కమ్యూనిటీస్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, వారంతా ఎన్నో కష్టాలు అనుభవించి ముందుకు సాగుతున్నారని కొనియాడారు. వారి నిబద్ధతను చూస్తుంటే ముచ్చటేస్తోందని, వారి చేతుల్లో తెలుగు జాతి భవిష్యత్తు సురక్షితమన్న నమ్మకం కలుగుతోందన్నారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని జస్టిస్ రమణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement