Thursday, May 2, 2024

ప్రత్యేక రైలులో స్వగ్రామం వెళ్లనున్న రాష్ట్రపతి కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని తన స్వస్థలం పారౌఖ్‌కు వెళ్లనున్నారు. రైలు మార్గం ద్వారా సొంతూరుకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన పరిచయస్తులతో పాటు కలిసి చదువుకున్న పాఠశాల మిత్రులను కలువనున్నారు. అయితే, 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందే రాంనాథ్‌ కోవింద్‌ సొంత గ్రామానికి వెళ్లాలనుకున్నా.. కరోనా మహమ్మారి కారణంగా సాధ్యం కాలేదని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

ప్రత్యేక రైలు శుక్రవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి.. సాయంత్రం కాన్పూర్‌ చేరుకుంటుంది. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. ఇక్కడ నాటి పాత పరిచయస్తులను కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో లక్నోకు చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement