Tuesday, April 30, 2024

ఈనెల 30న రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ (75) ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఆయ‌న ఆరోగ్యంపై రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ స‌ర్జ‌రీ చేసే అవకాశ‌ముంద‌ని తెలిపింది. ఈ మంగ‌ళ‌వారం (ఈనెల 30) ఇందుకు సంబంధించిన ఆప‌రేష‌న్ చేయవచ్చని వెల్ల‌డిచింది. సాధారణ వైద్య పరీక్షలు చేసిన అనంతరం నిపుణుల పరిశీలనలో రాష్ట్రపతి ఉన్నారని, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. కాగా ఛాతీ నొప్పి కారణంగా శుక్రవారం నాడు రాష్ట్రపతి కోవింద్ తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరగా.. అనంతరం అధికారులు ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement