Thursday, May 2, 2024

కర్నూలు ఎయిర్‌పోర్టులో చారిత్రక ఘట్టం

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు ఎయిర్‌పోర్టులో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కర్నూలు ఎయిర్‌పోర్టుకు తొలిసారిగా ప్రయాణికులతో కూడిన విమానం చేరుకుంది. 52 మంది ప్రయాణికులు 6E7911 ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి కర్నూలు చేరుకున్నారు. ఈ విమానంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. తిరిగి కర్నూలు నుంచి 74 మంది ప్రయాణికులు మరో విమానంలో(6E7912) విశాఖపట్నం బయలుదేరారు. అటు వైజాగ్ బయలుదేరే విమానానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి జాతీయ జెండా ఊపారు. కాగా బెంగళూరు నుండి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానంలో వచ్చిన వికలాంగులు, ప్రయాణికులతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కాసేపు ముచ్చటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement