Monday, May 6, 2024

National : అద్వానీకి భార‌త‌ర‌త్న… అంద‌జేసిన రాష్ట్ర‌ప‌తి ముర్ము…

మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి భార‌త‌ర‌త్న అవార్డును అందించారు. ఇవాళ స్వ‌యంగా అద్వానీకి ఇంటికి వెళ్లి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తిముర్ము ప్ర‌ధానం చేశారు.

- Advertisement -

అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇవాళ ఆయ‌న ఇంటికి వెళ్లి అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీష్ ధ‌న్క‌ర్‌, వెంక‌య్య నాయుడులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement