Sunday, May 19, 2024

బ‌ల‌వంతపు మ‌త మార్పిడిల‌ను రాజ్యాంగం ఒప్పుకోదు

బ‌ల‌వంతపు మ‌త మార్పిడిల‌ను రాజ్యాంగం ఒప్పుకోద‌ని క‌ర్ణాట‌క సిఎం బ‌స‌వ‌రాజు బొమ్మై అన్నారు. మత మార్పిడిని నిరోధించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని ఆయ‌న తెలిపారు.

మరోవైపు హిందూ మతానికి చెందిన 50 మందికి పైగా హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు ఇటీవల బొమ్మైను కలిశారు. బలవంతపు మత మార్పిడిలపై నిషేధం విధించాలని సీఎంను కోరారు. సీఎంను కలిసిన వారిలో హిందూ జనజాగృతి సమితి కన్వీనర్ మోహన గౌడ, శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాళిక్, సంతోష్ గురూజీ, సిద్ధలింగ స్వామి, ప్రణవానంద స్వామి తదితరులు ఉన్నారు. మరోవైపు ప్రమోద్ ముతాళిక్ మాట్లాడుతూ, స్కూళ్లు, ఆసుపత్రులను మతమార్పిడిలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇల్లీగల్ గా ఎన్నో చర్చిలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. మతాన్ని మార్చుకునే ఎస్సీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలని సీఎంకు వీరంతా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement