Thursday, May 16, 2024

పేదల పెన్నిది గంగుల.. మంత్రి ఎర్రబెల్లి కితాబు

కరీంనగర్ : కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పల్లె ప్రగతికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ హాజ‌ర‌య్యారు. గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామీణ క్రీడా మైదానాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గంగుల నాకు తమ్ముడు.. కమలాకర్ సమర్థుడు.. పేదల పక్షపాతి అంటూ కితాబు ఇచ్చారు. సీఎం రైతులను ఆదుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు, పట్టుబట్టి ధాన్యం కొనేలా గంగుల ఒప్పించాడన్నారు. నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ లని ఎన్టిఆర్ప ట్వారీ వ్యవస్థ రద్దు చేసి.. పేదలకు రూ.2 కిలో బియ్యం ఇస్తే కేసీఆర్ రైతులకే ఎకరాకు 10 వేలు ఎదురు పెట్టుబడి ఇస్తున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement