Saturday, May 18, 2024

దేవుడి ద‌గ్గ‌ర రాజ‌కీయాలు బాధ‌క‌రం : ఎంపీ కోమ‌టిరెడ్డి

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధాకరంగా ఉందని భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ….యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదన్నారు. స్థానిక ఎంపీగా ఉన్న తనను ఆలయ పునః ప్రారంభానికి పిలవలేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించిందన్నారు. తనకు ఆహ్వానం వస్తదని పార్లమెంట్ సమావేశాలున్నా హైదరాబాద్ కు వచ్చిన‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement