Monday, April 29, 2024

 టౌన్ క్లబ్ పై పోలీసుల మెరుపు దాడి.. 1.34 లక్షలు స్వాధీనం, 19 మంది అరెస్ట్

సిరిసిల్ల (ప్రభ న్యూస్) : పేకాట క్లబ్ పై పోలీసులు మెరుపు దాడి చేశారు. శనివారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టౌన్ క్లబ్ పై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి పేకాడుతున్న 19 మంది ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకులను అదుపు లోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్ల నుండి 1.34 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


పోలీసుల అదుపులో కాంగ్రెస్ మాజీ జిల్లాధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణాధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా పేకాట క్లబ్లు నిర్వహిస్తే సహించేది లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement