Friday, May 3, 2024

తీవ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి.. అటాక్​ చేసిన టెర్రరిస్టులు

శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇవ్వాల (మంగళవారం) జమ్మూకశ్మీర్ పోలీసు​ చనిపోయారు. కాగా, అతను జమ్మూ కాశ్మీర్ పోలీసు సైఫుల్లా ఖాద్రీగా గుర్తించారు. ఈ ఘటనలో అతని ఏడేళ్ల కుమార్తె కూడా గాయపడింది. ఒక్కసారిగా ఉగ్రవాదులు అటాక్​ చేసి కాల్పులు జరపడంతో ముందు ఖాద్రీ కూతురుకు గాయాలయ్యాయి. ఆమె చేతికి బుల్లెట్ గాయాలు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement