Sunday, May 5, 2024

మిక్సర్ గ్రైండర్ లో బంగారు బిస్కెట్స్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఒక కోటి 15 లక్షల విలువ చేసే బంగారం అధికారులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రయాణికుడు మిక్సర్ గ్రైండర్ లో కటింగ్ మిషన్ పెట్టుకుని అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు అధికారులు పట్టుకున్నారు. సుమారు 2.5 కేజీల బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు విదేశీ కరెన్సీ ని కూడా పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడు తన బ్యాగ్ లో 30,000 యూఎస్ డాలర్లు అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీల్లో భాగంగా సి ఐ ఎస్ ఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రయాణికులు వద్దనుంచి సుమారు 21,48,000 విలువచేసే విదేశీ కరెన్సీ ని సిఐఎస్ఎఫ్ అధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement