Friday, May 17, 2024

26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధాన నరేంద్ర మోడీ ఈనెల 26న హైదరాబాద్‌ రానున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ప్రారంభమై ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న దిదశాబ్ది వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారని ఐఎస్‌బీ పాలక మండలి ప్రకటించింది. పర్యటన దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపింది. ఐఎస్‌బీ పూర విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోడీ ఈ సందర్భంగా సమావేశమవుతారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement