Tuesday, May 7, 2024

కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు

టీ 20 వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శన ఇస్తున్న విరాట్‌ కోహ్లీ అక్టోబర్‌ నెలలో ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ కోసం జింబాబ్వే క్రికెటర్‌ సికిందర్‌ రాజా, సౌతాఫ్రికా ప్లేయర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కూడా పోటీ పడ్డారు. కానీ టైటిల్‌ను ఇండియన్‌ బ్యాటర్‌ కోహ్లీ ఎగురేసుకుపోయాడు. అక్టోబర్‌ నెలలో కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లో మాత్రమే కోహ్లీ బ్యాటింగ్‌ చేశాడు. కానీ దాంట్లో మూడు మ్యాచుల్లో అద్భుతమైన గేమ్‌ ఆడాడు. పాకిస్థాన్‌పై 82 నాటౌట్‌ ఇన్నింగ్స్‌ అసాధరణమైందని ఐసీసీ తెలిపింది. ఆ మ్యాచ్‌లో దాదాపు ఓటమి అంచులో ఉన్న ఇండియాను కోహ్లీ తన అద్భుత ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. టీ 20లో ఇదే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ అని కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్‌ లో ఇండియాను సెమీస్‌కు చేర్చడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. గురువారం అడిలైడ్‌లో జరిగే సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఇండియా తలపడనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement