Saturday, April 27, 2024

National : సోమాలియా తీరంలో పైరేట్స్… ఆటకట్టించిన భారత యుద్ధనౌక…

సోమాలియా తీరంలో సముద్రపు దొంగల (పైరేట్స్) ఆటకట్టించింది భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కతా. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్‌ కోల్‌కతాకు సాయంగా ఐఎన్ఎస్ సుభద్ర కూడా చేరింది. ఈ రెండింటికి సపోర్టుగా భారత వాయుసేన కూడా రంగంలోకి దిగడంతో ఆపరేషన్ మరింత ఈజీగా ముగిసింది. 35 మంది పైరేట్లతో అక్కడి నుంచి బయలుదేరిన నౌక ఈ ఉదయం ముంబై తీరం చేరుకుంది.

- Advertisement -

ఆ వెంటనే తాము బంధించిన 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించింది. అరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్ నేవీ ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టింది. ఇందులో భాగంగా నౌకలను మోహరించింది. ఈ నెల 15న అరేబియా సముద్రంలో పైరేట్ల నౌక ఎక్స్-ఎంవీ రూయెన్‌ను అడ్డగించిన భారత నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా 40 గంటల ఆపరేషన్ అనంతరం 35 మంది సముద్రపు దొంగలను బంధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement