Tuesday, April 30, 2024

PIL – రాష్ర‌ప‌తి మాత్ర‌మే ప్రారంభించాలి – సుప్రీంలో పిల్

న్యూఢిల్లీ – కొత్త‌గా నిర్మించిన పార్లమెంట్ భ‌వ‌నాన్ని భారత రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న‌ వ్యాజ్యం దాఖ‌లైంది.. . ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ . సుప్రీంకోర్టు న్యాయవాది సీఆర్ జయ సుకిన్ ఈ పిల్ వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతిని భాగస్వామిని చేయకపోవడం ద్వారా భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని పిల్ లో ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత చట్ట సభ పార్లమెంట్ అని పార్లమెంటులో భారత రాష్ట్రపతితో పాటు రెండు సభలు లోక్ సభ, రాజ్యసభ ఉంటాయని తెలిపారు. లోక్ సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుందని చెప్పారు. రాష్ట్రపతిని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం సరికాదని అన్నారు. పార్లమెంట్ శంకుస్థాపనకు కూడా రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించలేదని చెప్పారు. మరోవైపు పార్లమెంట్ ను ఈ నెల 28న ప్ర‌ధాని మోడీ ప్రారంభించ‌నుండ‌గా , విపక్షానికి చెందిన 20 పార్టీలు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement