Thursday, May 2, 2024

Picture of the day: మాజీ ప్రధానితో ప్రస్తుత ప్రధాని భేటీ..

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను, ప్రత్యేకమైన వ్యక్తులను కలిసి సంభాషిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాని తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ఫొటోలను షేర్ చేసి తన అనుభవాలను పంచుకుంటుంటారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్న మోడీ.. తాజాగా మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన దేవగౌడను ప్రధాని మోడీ సాదరంగా ఆహ్వానించి.. ఆయనతో ముచ్చటించారు. దేవగౌడతో మంగళవారం భేటీ అయిన ఫొటోలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీటిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీట్వీట్ చేయగా వాటిని పలువురు షేర్ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement