Monday, April 29, 2024

అన్ స్టాప‌బుల్ లో మూడు పెళ్లిళ్ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌ర‌ణ‌.. వారు ఊర‌కుక్క‌ల‌తో స‌మాన‌మ‌ని కౌంట‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్ స్టాప‌బుల్ టాక్ షోలో పాల్గొన్నారు.ఈ సంద‌ర్బంగా త‌న మూడు పెళ్లిళ్ల‌పై వివ‌ర‌ణ ఇచ్చార‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇందులో నిజా నిజాలేంట‌నేది పూర్తి షో బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు కానీ తెలియ‌దు. అయితే బ‌య‌ట వినిపిస్తోన్న వార్త‌ల‌ మేర‌కు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో నేరుగానే మూడు పెళ్లిళ్ల గురించి ప్ర‌శ్న వేశార‌ట‌. కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డా తొట్రు ప‌డ‌కుండా త‌న మూడు పెళ్లిళ్ల‌పై వివ‌ర‌ణ ఇచ్చార‌ట‌.

ప‌వ‌న్ స‌మాధానం విన్న త‌ర్వాత.. ఇంత స్ట్రయిట్ ఫార్వ‌ర్డ్‌గా చెప్పిన త‌ర్వాత కూడా అదే విష‌యంపై ప‌ర్స‌న‌ల్‌గా టార్గెట్ చేస్తే వారు ఊర కుక్క‌ల‌తో స‌మానం అంటూ ఘాటుగా ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌కు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లు నెట్టింట వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. నిజానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా ప్ర‌మోష‌నల్ ఇంట‌ర్వ్యూస్ కోసం బ‌య‌ట‌కు రారు. అలాంటిది నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న షోకు గెస్ట్‌గా వ‌చ్చారు. ఇలా చేయ‌టం ప‌వ‌న్ కెరీర్‌లోనే తొలిసారి. ఈ ఎపిసోడ్‌పై ఇటు సినీ వ‌ర్గాలే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాలు సైతం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. షో షూటింగ్ ముందే ప‌వ‌న్‌ను టార్గెట్ చేసిన వారు కూడా లేక‌పోలేదు. మ‌రి పూర్తి ఎపిసోడ్ బ‌య‌ట‌కు వ‌స్తే ఎలాంటి వివాదాల‌కు దారి తీస్తుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement