Sunday, May 5, 2024

ప‌రిటాల శ్రీరామ్ కి ‘హ‌గ్’ ఇచ్చిన జేసీ..క‌క్ష‌లు పోయిన‌ట్లేనా..

వారిద్ద‌రూ టిడిపి నేత‌లే..కానీ వారి కుటుంబాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది.వారే ప‌రిటాల ర‌వి..జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. అయితే అనూహ్యంగా అనంత‌పురం పాలిటిక్స్ లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఈ సీన్ చూసిన రాయలసీమ జనం మురిసిపోతున్నారు. ఆనంద పడుతున్నారు. ఒకప్పుడు అనంత జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. అప్పుడు జేసీ బ్రదర్స్‌ది కాంగ్రెస్‌. పరిటాల రవి వర్సెస్ జేసీ బ్రదర్స్. ఓ రేంజ్‌ హైవోల్టేజ్‌ పాలిటిక్స్ నడిచేవి. పరిటాల మర్డర్‌ విషయంలోనూ అప్పట్లో జేసీ ఫ్యామీలపై ఆరోపణలు వచ్చాయి. అయితే పరిస్థితులు మారాయి. జేసీ బ్రదర్స్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు విభేదాలు కొనసాగినా ఈ మధ్యే కాస్త చేంజ్‌ వచ్చింది. గతంలో జేసీ కుమారులను కలిశారు పరిటాల శ్రీరామ్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement