Monday, April 29, 2024

నీతి ఆయోగ్ సీఈవోగా ప‌ర‌మేశ్వ‌రం అయ్య‌ర్

నీతి ఆయోగ్ ప్ర‌స్తుత సీఈవో అమితాబ్ కాంత్ ప‌ద‌వీకాలం ఈనెల 30తో ముగియ‌నుంది. దీంతో నీతి ఆయోగ్ కు కొత్త సీఈవో వచ్చారు. నీతి ఆయోగ్ నూత‌న కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి (సీఈవో)గా ఐఏఎస్ అధికారి ప‌ర‌మేశ్వ‌రం అయ్య‌ర్ ఈరోజు నియ‌మితుల‌య్యారు. వ్య‌క్తిగ‌త‌, సిబ్బంది శిక్ష‌ణ విభాగం అయ్య‌ర్ నియామకాన్ని ప్ర‌క‌టించింది. రెండేండ్ల పాటు ప‌ర‌మేశ్వ‌రం అయ్య‌ర్ ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement