Monday, April 29, 2024

పేపర్ లీకేజీ ముమ్మాటికీ బీజేపీ కుట్ర – మంత్రి కొప్పుల

తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీల వ్యవహామ‌ని, పథకం ప్రకారమే పేపర్ బయటకు వచ్చింది, విద్యార్థుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. టిఎస్పిఎస్సీ పేపర్ లీకేజీలో ఉన్న వ్యక్తికి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గతంలో అనేక ఫొటోలు బయటకు వచ్చాయ‌న్నారు. తాజాగా పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీల వెనక బీజేపీ నాయకుల హస్తం ఉందన్నారు. తాజాగా పదవ తరగతి పేపర్ లీక్ చేసిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సాప్ లో చేసినట్టు ఆరోపణలు రావడం వాట్సాప్ లో చేసిన తర్వాత ఆ విషయాన్ని బండి సంజయ్ దాచడం ఇందుకు నిదర్శనం, ఈ సంఘటన విద్యా వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తీయటంలో భాగమే, పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కుట్ర ప్రభుత్వాన్ని బధ‌నాం చేయాలనుకుంటే తగిన శాస్తి జరిగిందని, బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి హెచ్చరించారు. ఇంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆటలు ఇక సాగవని, పరీక్షలు సక్రమంగా నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో బండి సంజయ్ లాంటి బీజేపీ నాయకులు ఆడుకుంటున్నారని, అధికార దాహంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆశతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్ ని భవిష్యత్తుని ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి అన్నారు. పదవ తరగతి పరీక్షా పత్రం లీకేజీ కేసుల వెనక ఎంత పెద్దవాళ్లు ఉన్న అందరిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement