Sunday, April 28, 2024

జ‌పాన్ లో మూడు రోజులు ఆడ‌నున్న.. రంగ‌స్థ‌లం

జ‌పాన్ లో రిలీజ్ కానుంది మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన హిట్ చిత్రం రంగ‌స్థ‌లం. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కించాడు.కాగా జ‌పాన్ లోని చిబా పట్టణంలోని పరిమిత థియేటర్లలో ఈ చిత్రం మూడు రోజులు ఏప్రిల్ 9 నుండి 11వ‌ర‌కు ఆడనుంది. ఇప్పటికే షో బుకింగ్‌లు కూడా తెరిచారు. జపనీస్ ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. సమంత హీరోయిన్‌గా నటించింది.

ఇందులో ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, నరేష్, రోహిణి మొల్లేటి, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్‌లో విడుదల చేసినప్పుడు స్వయంగా రామ్ చరణ్, ఎన్‌టీఆర్ అక్కడికి వెళ్లారు. జపాన్ ప్రేక్షకులు ఈ సినిమాపై, మన హీరోలపై చూపించిన అభిమానం చూసి అంతా అవాక్కయ్యారు. ఎన్‌టీఆర్ అయితే జపనీస్‌లో మాట్లాడి అక్కడి వాళ్లను షాక్ అయ్యేలా చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ అయ్యేలా చేసింది. రోజురోజుకు వసూళ్లు పెరగడంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచారు. ఈ సినిమా అక్కడ ఏకంగా 100 డేస్ విజయవంతంగా రన్ అయింది. దీనిపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా జపాన్ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement