Wednesday, May 15, 2024

IPL 2024 | ముంబై జట్టులోకే పాండ్యా.. గుజరాత్ కొత్త కప్టన్‌గా గిల్

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రిటెన్షన్ ప్రక్రియలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రెండు సీజన్ల పాటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా విషయంలో నెలకొన్నఉత్కంఠకు తెరపడింది. గడువులోపు గుజరాత్ టీమ్ అతన్ని రిటెయిన్ చేసుకున్నప్పటికీ.. ముంబై ఇండియన్స్ అనూహ్యంగా అతడిని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ముంబై జట్టు సోమవారం అధికారిక ప్రకటన చేసింది.

అయితే హార్దిక్ తప్పుకుంటే గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక, హార్దిక్ జట్టు నుంచి తప్పుకోవడంతో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది గుజరాత్ టైటాన్స్ టీమ్ మేనేజ్‌మెంట్. ఇక హార్ధిక్ పాండ్యా కోసం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను మంబై జట్టు వదులుకుంది. దీంతో ముందుగానే అనుకున్నట్లుగానే రాయల్ ఛాలెంజర్ జట్టులోకి వెళ్లాడు కామెరాన్ గ్రీన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement